,ముంబై : ప్రఖ్యాత బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ (90) అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస ఇబ్బందిగా ఉందని చెప్పడంతో (నవంబర్ 11) సోమవారం తెల్లవారుఝామున లతాజీని ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి సీనియర్ వైద్య సలహాదారు డాక్టర్ ఫరోఖ్ ఇ ఉద్వాడియా పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారు.ఎడమ వెంట్రిక్యులర్ ఫెయిల్యూయర్తోపాటు, న్యుమోనియో కూడా ఎటాక్ కావడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది.
కాగా లతా మంగేష్కర్ సెప్టెంబర్ 28 న 90వ పుట్టిన రోజు జరుపుకున్నారు. మరోవైపు అశుతోష్ గోవారికర్ చిత్రం ' పానిపట్' లో గోపికా బాయిగా నటించిన తన మేనకోడలు పద్మిని కోహ్లాపురి ఫస్ట్ లుక్ పోస్టర్ను నిన్న (నవంబరు 10) లతా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పద్మినితోపాటు , చిత్ర యూనిట్కు ఆమె శుభాకాంక్షలు అందజేసిన సంగతి తెలిసిందే.